Turmeric Board | ఆర్గానిక్ పసుపును పండించాలి: ఎంపీ అర్వింద్​

అక్షర టుడే, ఇందూరు : Turmeric Board | ఆర్గానిక్ పసుపు (Organic Turmeric) ను పండిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత డిమాండ్ పెరుగుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) తెలిపారు. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని హోటల్​లో వార్షికోత్సవ సభ నిర్వహించారు. Turmeric Board | పసుపు సాగులో జిల్లా ప్రత్యేకం ఎంపీ మాట్లాడుతూ.. పసుపు సాగులో జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, మూడు దశాబ్దాల […]

అక్షర టుడే, ఇందూరు : Turmeric Board | ఆర్గానిక్ పసుపు (Organic Turmeric) ను పండిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత డిమాండ్ పెరుగుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) తెలిపారు. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని హోటల్​లో వార్షికోత్సవ సభ నిర్వహించారు.

Turmeric Board | పసుపు సాగులో జిల్లా ప్రత్యేకం

ఎంపీ మాట్లాడుతూ.. పసుపు సాగులో జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, మూడు దశాబ్దాల రైతుల కలను నరేంద్ర మోదీ (Narendra Modi) నెరవేర్చారని తెలిపారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా వ్యక్తిని మొట్టమొదటి ఛైర్మన్​గా​ నియమించడం అదృష్టం అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పసుపు పంటసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగుచేస్తే మరింత డిమాండ్ ఉంటుందని సూచించారు.

Turmeric Board | పసుపు రైతుల బాధలపై అవగాహన ఉంది

పసుపు రైతుల బాధలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని వారికి ప్రభుత్వపరంగా జిల్లాయంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతులకు బదులుగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక విధానాల్లో నాణ్యమైన పసుపు పంటను సాగు చేయాలన్నారు. సేంద్రియ విధానంలో పంటను సాగుచేస్తే మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.

Turmeric Board | శాస్త్రీయ పద్ధతులు అవలంభించాలి

కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా పసుపు ప్రాసెసింగ్ విధానాల్లోనూ శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్​ అన్నారు. అంతకుముందు పసుపు బోర్డు కార్యదర్శి ఐఏఎస్ అధికారిణి భవానిశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానశాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...