OnePlus CEO | తైవాన్​ సంచలన నిర్ణయం.. ఒన్ ప్లస్​ సీఈవోపై అరెస్ట్​ వారెంట్​ ఇష్యూ..!

అక్షరటుడే, న్యూఢిల్లీ: OnePlus CEO | తైవాన్ – చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయిన సమయంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సీఈవోపై చర్యలకు ఉపక్రమించింది. ఆయనై అరెస్ట్ వారెంట్ జారీ Taiwan arrest warrant issue చేసింది. కాగా, చైనీస్ టెక్ కంపెనీ సీఈవోకు తైవాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. లోకల్ ట్యాలెంట్​ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకోవడం, […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: OnePlus CEO | తైవాన్ – చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయిన సమయంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సీఈవోపై చర్యలకు ఉపక్రమించింది. ఆయనై అరెస్ట్ వారెంట్ జారీ Taiwan arrest warrant issue చేసింది.

కాగా, చైనీస్ టెక్ కంపెనీ సీఈవోకు తైవాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. లోకల్ ట్యాలెంట్​ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకోవడం, టెక్నాలజీని లీక్ చేయడం అనే నేరాలపై తైవాన్ ఈ చర్యలు చేపట్టింది.

పీట్ లా నేతృత్వంలో గత పది సంవత్సరాల్లో 70 మంది ఇంజినీర్లను అక్రమంగా నియమించుకున్నారనే ఆరోపణలపై షిలిన్ జిల్లా ప్రాసిక్యూటర్స్ కార్యాలయం వారెంట్ జారీ చేసింది. తైవాన్ క్రాస్ స్ట్రైట్ చట్టం Taiwan’s Cross-Strait Act ప్రకారం.. పీట్ లాను అరెస్టు చేయాలని వారెంట్​లో ఉంది. తైవాన్​లో చైనా వ్యాపార నిబంధనలను లా ఉల్లంఘించినట్లు వారెంట్​లో వెల్లడించారు.

OnePlus CEO | ఏమిటీ ఉల్లంఘనలు..

ప్రాసిక్యూటర్స్ ప్రకారం.. హాంగ్ కాంగ్​లో వన్ ప్లస్ షెల్ కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే 2015లో తైవాన్​లో స్థానిక సర్కారు పర్మిషన్​ లేకుండానే బ్రాంచ్ తెరిచింది. చైనా కంపెనీలు తైవానీస్ లోకల్ ట్యాలెంట్​ను ఉపయోగించుకోవాలంటే.. సర్కారు నుంచి అనుమతి పొందాలి. కానీ, వన్ ప్లస్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీర్లను తన కంపెనీలో చేర్చుకుందనేది ప్రధాన ఆరోపణ. స్థానిక ఇంజినీర్ల ద్వారా తమ దేశ టెక్నాలజీని కాపీ కొట్టేందుకు ప్రయత్నించినట్లు తైవాన్ అభియోగం మోపుతోంది.

OnePlus CEO | చిప్ టెక్నాలజీనే కారణమా..

తైవాన్ ఈ స్థాయిలో స్పందించడానికి కారణం.. తైవాన్​ చిప్ టెక్నాలజీపై చైనా దేశం కన్నేయడమేననేది ప్రచారంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ కంట్రీకి  లేని బిప్ సెమీకండక్టర్ ప్రొడక్టివిటీ, సాంకేతికత తైవాన్ దేశానికి ఉంది. అమెరికా కంపెనీలు సైతం తైవాన్ దేశం పై ఆధారపడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే ఆగస్టు 16, 2025 న చైనా కంపెనీలపై తైవాన్​ విచారణ జరిపింది. ఆపిల్ కంపెనీకి చిప్​ సరఫరా చేసే గ్రేస్ వాంగ్ (Grace Wang) కంపెనీకి సైతం వారెంట్​ జారీ చేయడం గమనార్హం. తాజాగా వన్ ప్లస్ సీఈవోకు వారెంట్ జారీ చేయడం చర్చకు దారితీసింది. కాగా, తైవాన్​ వారెంట్​పై వన్​ ప్లస్​ కంపెనీ స్పందిస్తూ.. తమ వ్యాపార కలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతుందని వెల్లడించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...