Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష

Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన ఒకరికి జైలుశిక్ష

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తికి న్యాయస్థానం ఐదురోజుల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Drunk drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిని ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సాయిరెడ్డి పెట్రోల్​ బంక్​ వద్ద సంతోష్​ అనే వ్యక్తి అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

అతడికి కౌన్సెలింగ్​ నిర్వహించిన అనంతరం సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఐదురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. మొదటిసారి డ్రంకన్​ డ్రైవ్​లో దొరికితే రూ.10వేల జరిమానా, రెండోసారి దొరికితే రూ.15వేల వరకు న్యాయస్థానం జరిమానా విధిస్తుందని చెప్పారు.