Homeజిల్లాలుకామారెడ్డిPocharam Project | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

Pocharam Project | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​ వద్ద చోటు చేసుకుంది. రాజంపేట మండలం(Rajampet Mandal) సిద్దాపూర్​ గ్రామానికి చెందిన పచ్చంటి శేఖర్​ (32) దసరా రోజు సరదాగా చేపల వేటకు వెళ్లాడు.

పోచారం ప్రాజెక్ట్(Pocharam Project) దిగువన తన కుమారుడితో కలిసి చేపలు పడుతుండగా.. గాలం నీటిలో ఇరుక్కుంది. దీంతో దానిని తీసేందుకు నీటిలోకి దిగిన శేఖర్​ ఎంతకు బయటకు రాలేదు. దీంతో ఆయన కుమారుడు పక్కన ఉన్న వారికి చెప్పాడు. వారు అక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సాయంతో నీటిలో వెతకగా.. శనివారం ఉదయం మృతదేహం లభించింది. శేఖర్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్(Nagireddypet SI Bhargav) గౌడ్ తెలిపారు.