అక్షరటుడే, ఇందల్వాయి : Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree Exams) కొనసాగుతున్నాయి. డిగ్రీ (సీబీసీఎస్) ఒకటో, మూడో, ఐదో, సెమిస్టర్ రెగ్యులర్, రెండో, నాల్గో, ఆరో, సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం జరిగిన పరీక్షలకు 1,671 మంది విద్యార్థులకు గాను 1,545 మంది విద్యార్థులు హాజరయ్యారు. 125 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు.
మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,140 మంది విద్యార్థులకు గాను, 4,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. 224 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. కాగా.. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ (Giriraj Government Degree College)లో ఓ విద్యార్థి డిబార్ అయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
