Homeజిల్లాలునిజామాబాద్​CPIML Massline | నాణ్యమైన పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయాలి

CPIML Massline | నాణ్యమైన పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయాలి

ఆయిల్​​ కంపెనీలు నాణ్యమైన పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయాలని సీపీఐఎంఎల్​ మాస్​లైన్​ ప్రజాపంథా ప్రతినిధులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం తహశీల్దార్​ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: CPIML Massline | ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించాలని సీపీఐఎంఎల్ మాస్​లైన్ ప్రజాపంథా పార్టీ నాయకులు డిమాండ్​ చేశారు. డిచ్​పల్లి(Dichpally) తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్​కు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ (ప్రజాపంథా) మండల కార్యదర్శి బోశెట్టి మురళి మాట్లాడుతూ పెట్రోల్ బంక్(Petrol station) యజమానులు వినియోగదారులకు కల్తీ పెట్రోల్​, కల్తీ డీజిల్ అమ్ముతున్నారన్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసేటప్పుడు తూకాల్లో తేడా ఉంటుందని ఈ విషయాలు అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

CPIML Massline | సౌకర్యాలు కరువు

పెట్రోల్ బంక్​లలో పలు రకాల సేవలు ఉచితంగా అందించాల్సిన నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వాహనాల టైర్లలో ఉచితంగా గాలిని నింపాల్సి ఉన్నా.. డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. పలు బంక్​ల్లో గాలి నింపే సౌకర్యం ఏర్పాటు చేయడం లేదన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఈ సౌకర్యాలు పెట్రోల్​ పంపులలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ మాస్​లైన్ ప్రజాపంథా మండల సహాయ కార్యదర్శి వాసరి మోహన్, నాయకులు అశోక్, శేఖర్, మోహన్, సాయిలు, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News