Nizamsagar Project | నిజాంసాగర్​ నీటిని విడుదల చేసిన అధికారులు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగికి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్​ అధికారులు (Project Officers)  సోమవారం ఉదయం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని విడుదల చేశారు. Nizamsagar Project | 550 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి సోమవారం ఉదయం 550 క్యూసెక్కులు నీటిని ప్రధాన కాలువకు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగికి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్​ అధికారులు (Project Officers)  సోమవారం ఉదయం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని విడుదల చేశారు.

Nizamsagar Project | 550 క్యూసెక్కులు..

ప్రాజెక్టు నుంచి సోమవారం ఉదయం 550 క్యూసెక్కులు నీటిని ప్రధాన కాలువకు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధిక ప్రవాహం ఉంటున్న కారణంగా పశువులు, గొర్రెల కాపర్లు కాలువలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని వారు పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు పొరపాటున కూడా కాలువను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్​ఈ దక్షిణ మూర్తి, ఈఈ బాన్సువాడ సీహెచ్​ రాజశేఖర్​, నిజాంసాగర్ ఈఈ ​ సోలోమన్ (Nizamsagar EE Solomon)​, నిజాంసాగర్ డీఈఈ ​ప్రవీణ్​కుమార్​, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...