HomeUncategorizedExcise Department | కల్లు డిపోలను తనిఖీ చేసిన అధికారులు

Excise Department | కల్లు డిపోలను తనిఖీ చేసిన అధికారులు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని కల్లు డిపోలను ఎక్సైస్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీ చేశారు. డిపోల్లో కల్లు తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురువారం పరిశీలించారు.

Excise Department | లైసెన్స్​ల పరిశీలన

నగర పరిధిలోని మూడు కల్లు డిపోలలో లైసెన్స్​లను(License in Depot) అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి, ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ స్వప్న(Enforcement CI Swapna) మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు.

Excise Department | ఈత వనం తనిఖీ..

మల్లారంలో 16 ఎకరాల్లో ఉన్న ఈతవనాన్ని ఈ సందర్భంగా ఎక్సైజ్​ అధికారులు తనిఖీ చేశారు. ఈతవనం నుంచే కల్లును సేకరించాలని.. ఆ కల్లునే విక్రయించాలని తయారీదారులకు సూచించారు. అధికారుల వెంట ఎస్​హెచ్​వో సుష్మిత, ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Excise Department | కూకట్​పల్లిలో ఘటనతో అప్రమత్తం..

హైదరాబాద్​లోని(Hyderabad) కూకట్​పల్లిలో (Kukatpally) కల్తీకల్లు తాగి ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్​ శాఖ అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా నిజామాబాద్(Nizamabad)​ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని కల్లుడిపోలను అధికారులు తనిఖీలు చేశారు. స్వచ్ఛమైన కల్లునే అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు.

మల్లారంలో ఈతవనాన్ని పరిశీలిస్తున్న ఎక్సైజ్​ అధికారులు

Must Read
Related News