Yellareddy | నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు లేకుండా చూడాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | నామినేషన్ల దాఖలులో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో (Yellareddy MPDO), భిక్కనూరు పంచాయతీ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల (Nominations) ప్రక్రియ మంగళవారంతో ముగియనుందన్నారు. Yellareddy | టోకెన్లు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | నామినేషన్ల దాఖలులో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy) పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో (Yellareddy MPDO), భిక్కనూరు పంచాయతీ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల (Nominations) ప్రక్రియ మంగళవారంతో ముగియనుందన్నారు.

Yellareddy | టోకెన్లు జారీ ప్రక్రియ..

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు టోకెన్లు జారీచేసి క్రమపద్ధతిలో స్వీకరించాలని ఆర్డీవో సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యాలయంలో తగిన వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్, వార్డు స్థానాల కోసం నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నామినేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్​ను పరిశీలించారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా పాటించాలని ఆయన సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...