Jai Shankar | కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్:Jai Shankar | భారత్​, పాకిస్తాన్(India-Pakistan)​ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్, పాక్ కలిసి చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ స్పష్టం చేశారు. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్​లో భాగంగా పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్​ ధ్వంసం చేసింది. అనంతరం పాక్​ భారత్​పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. పాక్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Jai Shankar | భారత్​, పాకిస్తాన్(India-Pakistan)​ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్, పాక్ కలిసి చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ స్పష్టం చేశారు. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్​లో భాగంగా పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్​ ధ్వంసం చేసింది. అనంతరం పాక్​ భారత్​పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. పాక్​ దాడులను తిప్పి కొట్టిన భారత్, పాకిస్తాన్​లోని ఎయిర్​బేస్​లను ధ్వంసం చేసింది.

భారత్​, పాకిస్తాన్​ ఉద్రిక్తతల వేళ రెండు దేశాల డీజీఎంవో(DGMO)లు చర్చించుకొని కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(US President Donald Trump)​ తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన భారత్​ కంటే ముందే సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. వాణిజ్యం పేరు చెప్పి రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్​లో తీవ్ర దుమారం రేగింది. ట్రంప్​ చెబితే మోదీ(PM Modi) ఎందుకు తలొగ్గారని విపక్షాలు ప్రశ్నించాయి.

విపక్షాల ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ (External Affairs Minister Jaishankar) కాల్పుల విరమణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. భారత్, పాక్​ మధ్య మాత్రమే కాల్పుల విరమణ గురించి చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...