Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. సింగూరు, పోచారం డ్యామ్​ల (Singur and Pocharam dams) నుంచి జలాశయంలోకి వరద వస్తోంది.

నిజాంసాగర్​లోకి ప్రస్తుతం 14,564 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1404.5 (17.07 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్​ అధికారులు (Nizamsagar Project officials) రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు 13,564 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.

Nizamsagar Project | పోచారం డ్యామ్​లోకి..

పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి 2,137 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు డ్యామ్​పై నుంచి పొంగి పొర్లి మంజీరలో కలుస్తోంది. పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1.8 టీఎంసీలు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 22.5 టీఎంసీల వరద వచ్చింది. అందులో నుంచి ఆయకట్టు కోసం 0.156 టీఎంసీలు విడుదల చేశారు. 20.544 టీఎంసీలు మంజీరలోకి వెళ్లాయి.

Must Read
Related News