Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. సింగూరు, పోచారం డ్యామ్​ల (Singur and Pocharam dams) నుంచి జలాశయంలోకి వరద వస్తోంది. నిజాంసాగర్​లోకి ప్రస్తుతం 14,564 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1404.5 (17.07 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్​ అధికారులు (Nizamsagar Project officials) రెండు వరద గేట్లను […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. సింగూరు, పోచారం డ్యామ్​ల (Singur and Pocharam dams) నుంచి జలాశయంలోకి వరద వస్తోంది.

నిజాంసాగర్​లోకి ప్రస్తుతం 14,564 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1404.5 (17.07 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్​ అధికారులు (Nizamsagar Project officials) రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు 13,564 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.

Nizamsagar Project | పోచారం డ్యామ్​లోకి..

పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి 2,137 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు డ్యామ్​పై నుంచి పొంగి పొర్లి మంజీరలో కలుస్తోంది. పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1.8 టీఎంసీలు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 22.5 టీఎంసీల వరద వచ్చింది. అందులో నుంచి ఆయకట్టు కోసం 0.156 టీఎంసీలు విడుదల చేశారు. 20.544 టీఎంసీలు మంజీరలోకి వెళ్లాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...