Nizam sagar | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,02,369 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్​కు వరద వస్తుండటంతో వరద గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.8 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రధాన […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,02,369 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నిజాంసాగర్​కు వరద వస్తుండటంతో వరద గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.8 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువన సింగూరుకు ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్​కు ఇన్​ఫ్లో (inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

Nizam sagar | పోచారం ప్రాజెక్ట్​లోకి..

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్​కు (Pocharam project) స్వల్పంగా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్​లోకి 1,182 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు అలుగుపై నుంచి పారుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్​లోకి 26.5 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 24.5 టీఎంసీలు ప్రాజెక్ట్​పై నుంచి పొంగి దిగువకు వెళ్లింది. మరోవైపు ప్రాజెక్ట్​ పొంగి పొర్లుతుండటంతో చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...