Homeజిల్లాలుకామారెడ్డిNizam sagar | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

Nizam sagar | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

Nizam sagar | కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్​, పోచారం ప్రాజెక్ట్​లకు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. నిజాంసాగర్​లోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,02,369 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నిజాంసాగర్​కు వరద వస్తుండటంతో వరద గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.8 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువన సింగూరుకు ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్​కు ఇన్​ఫ్లో (inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

Nizam sagar | పోచారం ప్రాజెక్ట్​లోకి..

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్​కు (Pocharam project) స్వల్పంగా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్​లోకి 1,182 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు అలుగుపై నుంచి పారుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్​లోకి 26.5 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 24.5 టీఎంసీలు ప్రాజెక్ట్​పై నుంచి పొంగి దిగువకు వెళ్లింది. మరోవైపు ప్రాజెక్ట్​ పొంగి పొర్లుతుండటంతో చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు.