Homeతాజావార్తలుNizampet Municipal Corporation | స్థానిక సమస్యలపై మున్సిపల్​ కమిషనర్​ నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన నిజాంపేట్​ ప్రగతినగర్​...

Nizampet Municipal Corporation | స్థానిక సమస్యలపై మున్సిపల్​ కమిషనర్​ నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన నిజాంపేట్​ ప్రగతినగర్​ వాసులు!

Nizampet Municipal Corporation | హైదరాబాద్​లోని నిజాంపేట్​ మున్సిపల్​ కమిషనర్​పై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కుత్బుల్లాపూర్​​: Nizampet Municipal Corporation | హైదరాబాద్​లోని నిజాంపేట్​ మున్సిపల్​ కమిషనర్​పై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నిజాంపేట్​ పరిధి ప్రగతినగర్​లో ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న త్రీ మంకీస్​ చౌరస్తాలో శనివారం (నవంబరు 15) ధర్నా చేపట్టారు.

Nizampet Municipal Corporation | తీవ్ర అవినీతి ఆరోపణలు..

ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేషన్ జాయింట్​ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. నిజాంపేట్ మున్సిపల్ ప్రస్తుత grade 3 స్థాయి కమిషనర్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రస్తుత కమిషనర్​ సాబిర్​ అలీ పూర్తిగా విఫలం అయ్యారన్నారు.  అవినీతి అక్రమాలతో మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.

పనులు, వసతుల కల్పనలో బంధు/వర్గ ప్రీతి చూపుతున్నారని వాపోయారు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, సివిల్ వర్క్, టౌన్ ప్లానింగ్​లో ఆర్థిక నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజల ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. పార్కులు, రోడ్ల ఆక్రమణల నియంత్రణలో విఫలం అయ్యారని ఎద్దేశా చేశారు.

ప్రస్తుత కమిషనర్​ను బదిలీ చేసి గ్రూప్ – 1 / ఐఏఎస్ స్థాయి అధికారిని కార్పొరేషన్​కు కమిషనర్​గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

అనంతరం అవినీతి అధికారి చెర నుంచి నిజాంపేట్​ కార్పొరేషన్​ను కాపాడాలని కోరుతూ కోతి బొమ్మలకు వినతిపత్రం అందజేశారు.

Must Read
Related News