Bheemgal | ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలి

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కాంగ్రెస్​ నాయకులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్​ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్​లో (Hyderabad)లో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ను (PCC Chief Bomma Mahesh kumar) కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల ఆస్పత్రి, సమీకృత మార్కెట్ సముదాయ భవనాల పనులను […]

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కాంగ్రెస్​ నాయకులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్​ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్​లో (Hyderabad)లో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ను (PCC Chief Bomma Mahesh kumar) కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల ఆస్పత్రి, సమీకృత మార్కెట్ సముదాయ భవనాల పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు.

Bheemgal | నూతన భవనాలు మంజూరు చేయాలి

మండలంలో తహశీల్దార్​, సబ్ రిజిష్ట్రార్​ కార్యాలయం, అగ్రికల్చర్, ఎంఈవో, డిగ్రీ కళాశాల, గెస్ట్ హౌస్, నూతనంగా మంజూరైన కోర్టు, ముచ్కూర్ సొసైటీ భవనం, రహత్ నగర్​లో గోదాములు తదితర కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే ఆయాశాఖల మంత్రులతో ఫోన్​లో మాట్లాడారు. ఆయా కార్యాలయాలకు నూతన భవనాలను మంజూరు చేయాలని వారిని కోరినట్లు నాయకులు తెలిపారు.

వారు సైతం స్పందించి నూతన భవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణాధ్యక్షులు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి భోజా గౌడ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లెల లక్ష్మణ్, ముచ్కూర్ సొసైటీ ఛైర్మన్ బంగ్లా దేవేందర్, శీను, రాగుల మోహన్, ఏఎంసీ డైరెక్టర్ జీవన్, గట్టు సతీష్, భీమ్​గల్​ విలేజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి, శ్రీధర్ గౌడ్, పల్లె శేఖర్, కొరడి లింబాద్రి, బీసీ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...