Yellareddy | అధికారుల నిర్లక్ష్యం.. కల్యాణికి శాపం..!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | కల్యాణి ప్రాజెక్టు అధికారుల (Kalyani project officials) నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు మట్టి గట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వరద గేట్లు ఎత్తి ఉంటే భారీ నష్టం తప్పి ఉండేదని పేర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు తిమ్మాపూర్‌ తాటివాని మత్తడి లక్ష్మాపూర్‌ చెరువులు తెగిపోవడంతో ఒక్కసారిగా 40వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చింది. దీంతో ప్రాజెక్టు సిబ్బంది క్రస్ట్‌ గేట్లు సకాలంలో ఎత్తలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2006 లోనూ అధికారులు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | కల్యాణి ప్రాజెక్టు అధికారుల (Kalyani project officials) నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు మట్టి గట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వరద గేట్లు ఎత్తి ఉంటే భారీ నష్టం తప్పి ఉండేదని పేర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు తిమ్మాపూర్‌ తాటివాని మత్తడి లక్ష్మాపూర్‌ చెరువులు తెగిపోవడంతో ఒక్కసారిగా 40వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చింది.

దీంతో ప్రాజెక్టు సిబ్బంది క్రస్ట్‌ గేట్లు సకాలంలో ఎత్తలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2006 లోనూ అధికారులు క్రస్ట్‌ గేట్లు మరమ్మతులు చేయకపోవడంతో అవి మొరాయించాయని, ఫలితంగా భారీ వరదకు (heavy flood) తట్టుకోలేక మూడు గేట్లు కొట్టుకుపోయాయి. మళ్లీ ఈసారి సైతం వరదను అంచనా వేయడంలో అధికారులు, సిబ్బంది విఫమయ్యారని ఆరోపిస్తున్నారు.

Yellareddy | భారీగా నష్టం..

ప్రాజెక్టు అధికారులు (project officials), సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వందల ఎకరాల్లో పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వరద కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేసిందని, రాళ్లు, బురద పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందితోపాటు వ్యయప్రయాస అవుతోందన్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతిన్నాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

వర్షం కురిసిన రాత్రి సిబ్బంది ప్రాజెక్టు గేట్లను (project gates) ఎత్తేందుకు ప్రయత్నించినా.. లేవకపోవడం కారణమా? లేదా వరద ఉధృతికి సిబ్బంది భయాందోళనకు గురయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో ఏడు వరద గేట్లను ఎత్తి ఉంటే ముంపు ముప్పు ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. గేట్లు ఎత్తకపోవడంతోనే ప్రాజెక్టు గట్లు కొట్టుకుపోయాయి.

అంతేగాక, కోళ్ల ఫారం వద్ద 13 మంది బీహార్‌ కూలీలు (Bihar Workers) వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతోనైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా.. సిబ్బంది ప్రాణభయంతో ఎత్తలేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులను (Irrigation Department officials) సంప్రదించగా ఐదు గేట్లు స్వల్పంగా ఎత్తినట్లు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో 7 గేట్లను ఎత్తి ఉంటే ఇంతటి భారీ నష్టం ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ముప్పుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...