Ponnam Prabhakar | జూబ్లీహిల్స్​లో నవీన్​ యాదవ్​ను గెలిపించాలి : మంత్రి పొన్నం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponnam Prabhakar | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీసీ వర్గాలకు చెందిన నవీన్​ యాదవ్​ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​కు మద్దతుగా కొండాపూర్ మినర్వా కన్వెన్షన్ హాల్​లో కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం (Minister Ponnam) మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నవీన్ యాదవ్​ను (Naveen Yadav) గెలిపించుకోవాలన్నారు. కాపు, మున్నూరు కాపు వేరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponnam Prabhakar | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీసీ వర్గాలకు చెందిన నవీన్​ యాదవ్​ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​కు మద్దతుగా కొండాపూర్ మినర్వా కన్వెన్షన్ హాల్​లో కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

మంత్రి పొన్నం (Minister Ponnam) మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నవీన్ యాదవ్​ను (Naveen Yadav) గెలిపించుకోవాలన్నారు. కాపు, మున్నూరు కాపు వేరు వేరు కాన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కాపులంతా ఐక్యంగా కష్టపడాలని సూచించారు.

Ponnam Prabhakar |కాపులకు అవకాశాలు కల్పిస్తాం

స్థానిక సంస్థల ఎన్నికలు (local body elections), మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు వర్గానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. అయితే ఇంట్లో కూర్చుంటే ఎవరికి పదవులు రావని ఆయన స్పష్టం చేశారు. కష్టపడిన వారికి ఫలితం ఉంటుందన్నారు. కాపు సోదరులకు ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Minister Vivek Venkat Swamy), కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ponnam Prabhakar | జోరు పెంచిన పార్టీలు

జూబ్లీహిల్స్​ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలో ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్​ అభ్యర్థి తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బీఆర్​ఎస్​ (BRS) సైతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నేతలు బస్తీల్లో తిరుగుతున్నారు. కాగా జూబ్లీహిల్స్​ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్​ 11న పోలింగ్​ జరగనుండగా.. 14న కౌంటింగ్​ నిర్వహించనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...