Bhuvanagiri | దక్షిణాఫ్రికాలో యాదాద్రి యువకుడు ప్రవీణ్ కిడ్నాప్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhuvanagiri | యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బండ సోమారం గ్రామానికి చెందిన యువకుడు ప్రవీణ్ దక్షిణాఫ్రికాలో కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతోంది. బోర్ వెల్ రిగ్ పరిశ్రమ (Bore Well Rig Industry)లో ప‌ని చేసేందుకు ఈ జిల్లా నుండి అనేక మంది విదేశాల‌కి వెళ్లి అక్క‌డే జీవినం సాగిస్తుంటారు. వారిలో ప్ర‌వీణ్ ఒక‌రు. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఓ బోర్‌వెల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ (నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhuvanagiri | యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బండ సోమారం గ్రామానికి చెందిన యువకుడు ప్రవీణ్ దక్షిణాఫ్రికాలో కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతోంది. బోర్ వెల్ రిగ్ పరిశ్రమ (Bore Well Rig Industry)లో ప‌ని చేసేందుకు ఈ జిల్లా నుండి అనేక మంది విదేశాల‌కి వెళ్లి అక్క‌డే జీవినం సాగిస్తుంటారు.

వారిలో ప్ర‌వీణ్ ఒక‌రు. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఓ బోర్‌వెల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ (నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల చిన్న కుమారుడు) గత ఏడాది నవంబరులో కంపెనీ పనుల నిమిత్తం దక్షిణాఫ్రికా (South Africa)కు వెళ్లాడు. అక్కడ మాలి రాష్ట్రంలోని కోబ్రి ప్రాంతంలో బోరు యంత్రాల పనితీరును పర్యవేక్షించేవాడు.

Bhuvanagiri | ఉగ్ర‌వాదుల చెర‌లో..

గత నెల 23న విధులు ముగించుకుని తన షెల్టర్‌కు వెళ్తుండగా, మార్గమధ్యలో జేఎన్‌ఐఎం (JNIM) ఉగ్రవాద గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ గ్రూప్ గతంలోనూ అదే ప్రాంతంలో విదేశీయులను అపహరించిన ఘటనలు ఉన్నాయి. ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రవీణ్ ఆ రోజు నుండి ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. అదే సమయంలో రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు ఆయన కిడ్నాప్ విషయాన్ని కుటుంబానికి వెల్లడించడంతో ఆత్రుత మరింత పెరిగింది. కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలా ఉండగా బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం (India Embassy)తో సంప్రదింపులు జరుపుతూ ప్రవీణ్‌ను క్షేమంగా బ‌య‌ట‌కు తీయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

ఈ సంఘటనతో గ్రామంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రవీణ్ త్వరగా సురక్షితంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు విన్న త‌ర్వాత చాలా మంది విదేశాల‌కి వెళ్లాలంటే జంకుతున్నారు. విదేశాల‌కి వెళ్లిన స‌మ‌యంలో కొంద‌రు తూటాల‌కి కూడా బ‌ల‌వుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...