Nalgonda | కార్పొరేషన్‌గా నల్గొండ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ మున్సిపాలిటీ (Nalgonda Municipality)ని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేసింది. ఈ మేరకు బుధవారం గెజిట్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండేవి. అయితే తాజాగా నల్గొండను అప్​గ్రేడ్​ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ (Hyderabad)​ మినహా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్​, మంచిర్యాల, మహబూబ్​నగర్​ కార్పొరేషన్లు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నల్గొండ చేరింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ మున్సిపాలిటీ (Nalgonda Municipality)ని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేసింది. ఈ మేరకు బుధవారం గెజిట్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండేవి. అయితే తాజాగా నల్గొండను అప్​గ్రేడ్​ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ (Hyderabad)​ మినహా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్​, మంచిర్యాల, మహబూబ్​నగర్​ కార్పొరేషన్లు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నల్గొండ చేరింది. కాగా నల్గొండ బల్దియాను కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేస్తూ ఇటీవల శాసనసభ తీర్మానం చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన గెజిట్​ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ మహానగరంగా మారనుంది. కార్పొరేషన్​ కావడంతో ఛైర్మన్​ స్థానంలో మేయర్​, కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్ల ఎన్నిక నిర్వహించనున్నారు.

Nalgonda | గ్రామాల విలీనం లేకుండానే..

ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో నల్గొండలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. పట్టణంలో ప్రస్తుతం 48 వార్డులు ఉన్నాయి. 2.25 లక్షల జనాభా ఉంది. దీంతో శివారు గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్​గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకుని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...