అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | నగరపాలక సంస్థ తుది ఓటరు జాబితాను (final voter list) సోమవారం కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar) విడుదల చేశారు. గతంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా.. రాజకీయ పార్టీల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి.
అభ్యంతరాలను సవరించిన అనంతరం ఫొటోతో కూడిన తుది జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో (Nizamabad city) మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది ఉండగా.. ఇతరులు 44 మంది ఉన్నారు. అత్యధికంగా 11వ డివిజన్ లో 7,753 మంది, 19వ డివిజన్లో 7,708 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 44వ డివిజన్లో 3,702 మంది, 45వ డివిజన్లో 4,650 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
