Nizamabad Collector | దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: కలెక్టర్

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లో దివ్యాంగులు ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు.

Nizamabad Collector | దివ్యాంగుల కోసం పథకాల అమలు

ప్రభుత్వం దివ్యాంగుల కోసం పలు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తుందని గుర్తు చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాలను అన్ని వసతులతో కొనసాగిస్తున్నామన్నారు. అలాగే నగరంలో దివ్యాంగుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Nizamabad Collector | సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యం

సంక్షేమ పథకాలు (welfare schemes), ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్​ భరోసా కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా దివ్యాంగులకు సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (cultural programs), గీతాలాపన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో దివ్యాంగుల సంఘాలకు రూ.12.5 లక్షల విలువ చేసే చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమూర్తి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్​బీ, డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు హేమలత, మమత, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...