Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు. బోధన్​ డివిజన్​లోని (Bodhan division) సాలూర, జాడిజమాల్​పూర్త గ్రామాల్లో సర్పంచ్​ అభ్యర్థులుగా నిలబడిన కాంగ్రెస్​ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ అంటే భరోసా అనే నమ్మకం కలిగిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని సూచించారు. జాడిజమాల్​పూర్​లో (Jadijamalpur) చిన్న వయసులో విద్యావంతురాలు […]

అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు. బోధన్​ డివిజన్​లోని (Bodhan division) సాలూర, జాడిజమాల్​పూర్త గ్రామాల్లో సర్పంచ్​ అభ్యర్థులుగా నిలబడిన కాంగ్రెస్​ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ అంటే భరోసా అనే నమ్మకం కలిగిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని సూచించారు. జాడిజమాల్​పూర్​లో (Jadijamalpur) చిన్న వయసులో విద్యావంతురాలు నిహారిక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం గ్రామస్థుల అదృష్టంగా భావించాలన్నారు.

గ్రామంలో విద్యావంతురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలకు ఉత్తమ సేవలు అందడంతో పాటు అభివృద్ధి సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, పార్టీ బోధన్ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు, సాలూర పీఏసీఎస్​ ఛైర్మన్ అల్లె జనార్దన్​, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందర్ రాజు, అల్లె రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...