PM Modi | ట్రంప్‌, నెతన్యాహుపై మోదీ ప్రశంసలు.. బందీల విడుదలను స్వాగతించిన ప్రధాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | గాజా శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ 20 మంది బందీలను విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వాగతించారు. అలాగే శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్(US President Donald Trump)పై ప్రశంసలు కురిపించారు. బందీల విడుదల ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Israeli Prime Minister Benjamin Netanyahu) అచంచలమై, బలమైన సంకల్పానికి నిదర్శనమని అభివర్ణించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | గాజా శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ 20 మంది బందీలను విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వాగతించారు. అలాగే శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్(US President Donald Trump)పై ప్రశంసలు కురిపించారు. బందీల విడుదల ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Israeli Prime Minister Benjamin Netanyahu) అచంచలమై, బలమైన సంకల్పానికి నిదర్శనమని అభివర్ణించారు.

ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయిల్‌, హమాస్‌ (Israel and Hamas) కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండేళ్లకు పైగా హమాస్‌ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయిలీలను హమాస్‌ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు గాజాలోని మూడు ప్రాంతాల్లో బందీలను రెడ్‌ క్రాస్​కు అప్పగించింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌ కూడా దాదాపు రెండు వేల మంది పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు అంగీకరించింది.

PM Modi | శాంతి ప్రయత్నాలకు భారత్‌ మద్దతు..

తాజా పరిణామాలను ప్రధాని మోదీ స్వాగతించారు. శాంతిని తిరిగి నెలకొల్పేందుకు భారత్‌ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకు రావడానికి నిజాయితీ గల ప్రయత్నాలను భారతదేశం పూర్తిగా సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ లో ఓ పోస్టు పెట్టారు. “రెండు సంవత్సరాల నిర్బంధం తర్వాత బందీలను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాము. బాధితుల కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ అచంచలమైన శాంతి ప్రయత్నాలకు, ప్రధాన మంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి బందీల స్వేచ్ఛ ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ నిజాయితీగా చేసే ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నామని” మోదీ పోస్టు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...