PM Modi | హైదరాబాద్​లో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ.. ప్రారంభించిన మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్​గా దీనిని ప్రారంభించారు. అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్స్ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో మొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-Iని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టగల సామర్థ్యం స్కైరూట్ కలిగి ఉంది. ఈ క్యాంపస్​ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్​ రాకెట్‌ ఫ్యాక్టరీ (Private Rocket Factory) కావడం గమనార్హం. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రైవేట్​ రాకెట్​ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్​గా దీనిని ప్రారంభించారు.

అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్స్ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో మొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-Iని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టగల సామర్థ్యం స్కైరూట్ కలిగి ఉంది. ఈ క్యాంపస్​ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్​ రాకెట్‌ ఫ్యాక్టరీ (Private Rocket Factory) కావడం గమనార్హం. ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. స్కైరూట్‌ టీమ్​ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇది ఒక్క గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు. భారత అంతరిక్ష రంగం రానున్న రోజుల్లో మరిన్ని ఘనతలు సాధిస్తుందన్నారు.

PM Modi | ఇన్ఫినిటీ క్యాంపస్ గురించి..

కొత్తగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యం దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అనేక ప్రయోగ వాహనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, సమగ్రపరచడం పరీక్షించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఐఐటీ పూర్వ విద్యార్థులు, ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు (Former ISRO Scientists) పవన్ చందన, భరత్ డాకా దీనిని స్థాపించారు. ఈ కంపెనీ నవంబర్ 2022లో భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన సబ్-ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-ఎస్‌ను ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...