PM Modi | ఇరాన్ అధ్య‌క్షుడికి మోదీ ఫోన్‌.. తాజా ఉద్రిక్త‌త‌ల‌పై ఆందోళ‌న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | ఇజ్రాయెల్‌-ఇరాన్ మ‌ధ్య యుద్ధం తీవ్ర‌మ‌వుతుండ‌డంపై ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఇరాన్ అధ్య‌క్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. ప్రాంతీయ శాంతిభ‌ద్ర‌త‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి, ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించ‌డానికి చ‌ర్చ‌లు, దౌత్య‌ మార్గాలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా భారీ బాంబుల‌తో దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | ఇజ్రాయెల్‌-ఇరాన్ మ‌ధ్య యుద్ధం తీవ్ర‌మ‌వుతుండ‌డంపై ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఇరాన్ అధ్య‌క్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. ప్రాంతీయ శాంతిభ‌ద్ర‌త‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి, ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించ‌డానికి చ‌ర్చ‌లు, దౌత్య‌ మార్గాలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా భారీ బాంబుల‌తో దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు చర్చలు ప్రారంభించాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు మోదీ ‘ఎక్స్‌’లో ఓ పోస్టు చేశారు. “ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌(Iranian President Massoud Pezeshkian)తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి గురించి ఇద్ద‌రం వివరంగా చర్చించాం. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయ శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య ప్ర‌య‌త్నాలు ప్రారంభించాల‌ని పునరుద్ఘాటించాం” అని ప్రధాని మోదీ ‘X’లో రాశారు.

ఇరాన్ అణు కార్య‌క్ర‌మం త‌మ దేశానికి ముప్పుగా ప‌రిణ‌మిస్తుందంటూ ఇజ్రాయెల్(Israel) ఆ దేశంపై దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాలు పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగాయి. తాజాగా అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగా యుద్ధ‌ రంగంలోకి ప్ర‌వేశించింది. ఇరాన్‌లోని మూడు కీల‌క‌మైన అణుస్థావ‌రాల‌పై భారీ బంక‌ర్ బ‌స్టర్ బాంబుల‌తో (Bunker buster bombs) దాడి చేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...