అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్తో ఎమ్మెల్యే తోట లక్ష్మీరాంతారావు (MLA Thota Lakshmi Kantarao) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో పీసీసీ చీఫ్కు హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేశారని అన్నారు. ఈ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
