Minister Komatireddy | రైతు కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి.. రూ.3 లక్షల ఆర్థిక సాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Komatireddy | రైతు కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అండగా నిలిచారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం (Ghanapur Village)లో రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజిరెడ్డి రెండెకరాల భూమిలో రెండు బోర్లు వేసినా నీళ్లు రాలేదు. దీంతో పశువుల వ్యాపారం చేశాడు. అందులోనూ నష్టపోయాడు. దీంతో రూ.5 లక్షల వరకు అప్పులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Komatireddy | రైతు కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అండగా నిలిచారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

సిద్దిపేట జిల్లా (Siddipet District) నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం (Ghanapur Village)లో రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజిరెడ్డి రెండెకరాల భూమిలో రెండు బోర్లు వేసినా నీళ్లు రాలేదు. దీంతో పశువుల వ్యాపారం చేశాడు. అందులోనూ నష్టపోయాడు. దీంతో రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలని రాజిరెడ్డి మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక శనివారం రాత్రి గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.

రాజిరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి మంగళవారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం తరఫున అందే రైతు బీమా (Rythu Bheema) సహాయం తక్షణమే అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...