Metro Train | సొరంగంలో ఆగిపోయిన మెట్రోరైలు.. నడచుకుంటూ వచ్చిన ప్రయాణికులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Metro Train | సాంకేతిక కారణాలతో మెట్రోరైలు సొరంగం (Subway)లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు నడుచుకుంటూ రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చెన్నైలో చోటు చేసుకుంది. నగరంలోని విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (Chennai International Airport) వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో సెంట్రల్‌ మెట్రో – హైకోర్టు స్టేషన్‌ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Metro Train | సాంకేతిక కారణాలతో మెట్రోరైలు సొరంగం (Subway)లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు నడుచుకుంటూ రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చెన్నైలో చోటు చేసుకుంది.

నగరంలోని విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (Chennai International Airport) వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో సెంట్రల్‌ మెట్రో – హైకోర్టు స్టేషన్‌ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5.45 గంటల ప్రాంతంలో చెన్నై సెంట్రల్ మెట్రో రైలు స్టేషన్ (Chennai Central Metro Rail station) నుంచి విమ్కో నగర్ వైపు రైలు బయలుదేరింది. కొన్ని నిమిషాల తర్వాత సొరంగం లోపల రైలు ఆగిపోయింది. అధికారులు దానిని మళ్లీ స్టార్ట్​ చేసే ప్రయత్నం చేసిన ఫలించలేదు. దీంతో ప్రయాణికులను సమీపంలోని హైకోర్టు స్టేషన్​కు నడుచుకుంటూ వెళ్లమని వారు సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకున్నారు.

Metro Train | సేవలకు అంతరాయం

సొరంగంలో నిలిచిపోయిన రైలును మరొక రైలు ఉపయోగించి అక్కడి నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఈ ఘటనతో చెన్నై సెంట్రల్, హైకోర్టు స్టేషన్ మధ్య దాదాపు అరగంట పాటు సేవలు నిలిచిపోయాయి. దీనిపై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (Chennai Metro Rail Limited) స్పందించింది. రైలు నిలిచిపోవడంతో వెంటనే చర్యలు చేపట్టామని పేర్కొంది. ఆ రైలును వెంటనే ట్రాక్​ నుంచి తొలగించామని, ఉదయం 6:20 గంటలకు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...