Medaram Sammakka Sarakka Jathara | నేడు మేడారంలో మంత్రివర్గ సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Sammakka Sarakka Jathara | మేడారంలో నేడు (ఆదివారం, ఈ నెల 18వ తేదీ) సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్​ నిర్మించింది. ఆయా పనులను ప్రారంభించడానికి సీఎం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Sammakka Sarakka Jathara | మేడారంలో నేడు (ఆదివారం, ఈ నెల 18వ తేదీ) సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించబోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్​ నిర్మించింది. ఆయా పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్​రెడ్డి నేడు ఈ నెల 18న మేడారం చేరుకుంటారు. అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి 19న అమ్మవారి గద్దెలను సీఎం ప్రారంభిస్తారు. మేడారంలో కాకతీయుల నాటి కళా వైభవం ఉట్టిపడేలా రాతి కట్టడాలతో గద్దెల తోరణాలను నిర్మించారు.

Medaram Sammakka Sarakka Jathara | పాలేరులో పర్యటన

పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఈ నెల 18న సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికితోడు మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుంది. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​ను ప్రారంభిస్తారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...