Medaram Jathara | సాంస్కృతిక వైభవాన్ని చాటేలా మేడారం జాతర ఏర్పాట్లు : డిప్యూటీ సీఎం భట్టి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | ములుగు జిల్లా మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదివారం పర్యటించారు. సమ్మక్క–సారలమ్మను (Samakka-Saralamma temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం జాతర (Medaram Jatara) శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | ములుగు జిల్లా మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదివారం పర్యటించారు. సమ్మక్క–సారలమ్మను (Samakka-Saralamma temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మేడారం జాతర (Medaram Jatara) శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇందులో జాతర నిర్వహణకు రూ.150 కోట్లు, శాశ్వత ఆలయ నిర్మాణాలకు రూ.110 కోట్లు కేటాయించామని వెల్లడించారు. పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తతతో ఉండాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Medaram Jathara | రామగుండం పవర్​ ప్లాంట్​

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో (Ramagundam constituency) డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. త్వరలోనే రామగుండంలో పవర్ ప్లాంట్ ప్రకటన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 5.14 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం త్వరలోనే కల్పిస్తామన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...