Weather Updates | ఎల్​నినో ఎఫె​క్ట్​.. మండనున్న ఎండలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది. మరి కొన్ని రోజుల్లో ఎండాకాలం మొదలు కానుంది. అయితే ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. తెలంగాణ (Telangana)లో వరదలు ముంచెత్తాయి. శీతాకాలంలో సైతం కోల్డ్​వేవ్​లతో ప్రజలు వణికిపోయారు. మొన్నటి వరకు చలి పంజా విసిరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ప్రస్తుతం చలితీవ్రత క్రమంగా తగ్గుతోంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది. మరి కొన్ని రోజుల్లో ఎండాకాలం మొదలు కానుంది. అయితే ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.

దేశవ్యాప్తంగా వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. తెలంగాణ (Telangana)లో వరదలు ముంచెత్తాయి. శీతాకాలంలో సైతం కోల్డ్​వేవ్​లతో ప్రజలు వణికిపోయారు. మొన్నటి వరకు చలి పంజా విసిరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ప్రస్తుతం చలితీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఎండలు సైతం దంచికొట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Weather Updates | వర్షసూచన

ఎండాకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఎండాకాలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 తర్వత, మార్చి, ఏప్రిల్​ నెలల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ ఎండాకాలం ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతాయి. అయితే వేసవి రెండో భాగంలో ఎండలు దంచి కొట్టనున్నాయి. మే, జూన్​ నెలల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. 2023లాగే ఈ ఏడాది సైతం ఎండలు మండనున్నాయి. అలాగే రుతుపవనాలు సైతం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్ (Storm)​ల కారణంగా వేడిగాలులు వీస్తాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...