Bangladesh | బంగ్లాదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం.. 1500 ఇళ్లు దగ్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొరైల్ మురికివాడ (Korail Slum)లో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మంటలు అంటుకొని దాదాపు 1500 గుడిసెలు కాలిపోయాయి. ఢాకా (Dhaka)లోని అతిపెద్ద మురికివాడల్లో కొరైల్​ ప్రాంతం ఒకటి. మంగళవారం రాత్రి మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident)తో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తగరపు పైకప్పు గల గుడిసెల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొరైల్ మురికివాడ (Korail Slum)లో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మంటలు అంటుకొని దాదాపు 1500 గుడిసెలు కాలిపోయాయి.

ఢాకా (Dhaka)లోని అతిపెద్ద మురికివాడల్లో కొరైల్​ ప్రాంతం ఒకటి. మంగళవారం రాత్రి మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident)తో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తగరపు పైకప్పు గల గుడిసెల వరుసలు కాలిపోయిన శిథిలాలుగా మారాయని అధికారులు తెలిపారు.

Bangladesh | 80 వేల మంది నివాసం

ఈ ప్రాంతంలో దాదాపు 80 వేల మంది నివాసం ఉంటారు. గుల్షన్, బనాని పరిసరాల మధ్య ఈ మురికి వాడ ఉంది. చుట్టూ ఉన్నత స్థాయి అపార్ట్‌మెంట్ టవర్ల సమూహాలు ఉన్నాయి. రాత్రిపూట ఆకాశంలోకి నారింజ రంగు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు గుడిసెల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని బయటకు వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 19 ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు. మంగళవారం రాత్రి చెలరేగిన మంటలు బుధవారం అదుపులోకి వచ్చాయి.

Bangladesh | కట్టుబట్టలతో..

భారీ అగ్ని ప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. తమ సామగ్రి అంతా కాలిపోయిందని, ఇప్పుడు ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...