అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడవ టౌన్ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ చౌరస్తా వద్ద బీహార్కు (Bihar) చెందిన రాంనాథ్ మెహతా అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి కొనేందుకు అక్కడికి వచ్చిన ఏడుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారికి టెస్ట్ చేయగా పాజిటివ్గా వచ్చింది. దీంతో వారిందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
