Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్​లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో (Encounters) భారీగా నక్సల్స్​ మృతి చెందుతున్నారు. ఇటీవల కీలక నేతలు సైతం నేలకు ఒరిగారు. దీంతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులకు లొంగుబాట్లు మరింత్​ షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఛత్తీస్​గఢ్​లో 51 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్​లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో (Encounters) భారీగా నక్సల్స్​ మృతి చెందుతున్నారు. ఇటీవల కీలక నేతలు సైతం నేలకు ఒరిగారు. దీంతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులకు లొంగుబాట్లు మరింత్​ షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఛత్తీస్​గఢ్​లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Maoists | తగ్గుతున్న కార్యకలాపాలు

ఛత్తీస్​గఢ్​​లోని (Chhattisgarh) నారాయణపూర్‌, బీజాపూర్‌, సుక్మా, కాంకేర్‌ జిల్లాల్లో మొత్తం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆపరేషన్​ కగార్​తో పాటు, పునరావాస విధానం అమలు చేయడంతో చాలా మంది మావోలు అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. 431 మంది లొంగిపోయారన్నారు.

Maoists | రూ.1.15 కోట్ల రివార్డు

బీజాపూర్ జిల్లాలో 25 మంది గురువారం లొంగిపోయారు. వారిపై రూ.1.15 కోట్ల రివార్డు ఉన్నట్టు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రోత్సాహకంగా రూ.50 వేల చెక్కులు అందించారు. అలాగే కాంకేర్ ఎస్పీ కల్యాణ్ ఎలిసెల ఎదుట 13 మంది లొంగిపోయారు. సుక్మా ఎస్పీ ఎదుట ఐదుగురు లొంగిపోయారు.

నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా సమక్షంలో ఎనిమిది మావోలు లొంగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కమాండర్ కమలేశ్‌ సైతం లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై రూ.33 లక్షల రివార్డు ఉంది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...