Mallujola Venugopal | లొంగిపోయిన మావోయిస్ట్​ కీలక నేత మల్లోజుల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallujola Venugopal | మావోయిస్ట్​ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. కొంతకాలంగా ఆయన సరెండర్​ అవుతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆయుధాలు వీడి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్​ పెద్దపల్లి జిల్లా(Peddapalli District)కు చెందిన వారు. 2011లో ఎన్​కౌంటర్​లో చనిపోయిన కిషన్​జీ అలియాస్​ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్​కౌంటర్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallujola Venugopal | మావోయిస్ట్​ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. కొంతకాలంగా ఆయన సరెండర్​ అవుతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆయుధాలు వీడి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు.

మల్లోజుల వేణుగోపాల్​ పెద్దపల్లి జిల్లా(Peddapalli District)కు చెందిన వారు. 2011లో ఎన్​కౌంటర్​లో చనిపోయిన కిషన్​జీ అలియాస్​ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్​కౌంటర్​ మరణించారు. 1970లో ఉద్యమ బాట పట్టిన ఆయన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. వెస్ట్​ బెంగాల్​ లాల్​గడ్​ ఉద్యమానికి వేణుగోపాల్ నాయకత్వం వహించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్​ పొలిట్ బ్యూరో సభ్యురాలు పోతుల సుజాత వేణుగోపాల్ అన్న భార్య కావడం గమనార్హం. అయితే మల్లోజుల కొంతకాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.

Mallujola Venugopal | లేఖతో కలకలం

మల్లోజుల అభయ్​ పేరిట గతంలో లేఖ విడుదల చేశారు. తాము ఆయుధాలు వీడి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అందులో పేర్కొన్నారు. దీనిపై మావోయిస్ట్​ పార్టీ(Maoist Party)లో పెద్ద వివాదం చెలరేగింది. మల్లోజుల తీరును పార్టీ తప్పు పట్టింది. ఆ లేఖ ఆయన సొంత నిర్ణయమని ప్రకటించింది. వెంటనే ఆయుధాలు అప్పగించాలని మల్లోజులను పార్టీ ఆదేశించింది. అనంతరం మల్లోజుల మరో లేఖ రాశారు. పార్టీ అనుసరిస్తున్న పంథా తప్పు అని ఆయన 22 పేజీల లేఖను క్యాడర్​కు రాశారు. అప్పుడే ఆయన లొంగిపోతారని అంతా భావించారు. తాజాగా ఆయన 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసు(Gadchiroli Police)లకు లొంగిపోయారు.

Mallujola Venugopal | లేఖలో ఏముందంటే..

విప్లవోద్యమంలో లోపాలపై ఇటీవల మల్లోజుల సుదీర్ఘ లేఖ రాశారు. పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉందని, ఆయుధ పోరాటాలను విరమించాలని కోరారు. దశాబ్దాల తప్పుడు నిర్ణయాలతో పార్టీ ఎంతో నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలాన్ని అతిగా అంచనా వేసి, శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేశామని ఆయన అన్నారు. 2011 నుంచే కిందిస్థాయి కామ్రేడ్స్‌ ఈ తప్పును సరిదిద్దుకోవాలని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఒక దశాబ్దం పాటు నష్టపోయామని తెలిపారు. అమరుల రక్తతర్పణం నుంచి గుణపాఠాలు నేర్చుకుందామని లేఖలో కోరారు. మల్లోజుల కేంద్ర కమిటీలో 28 ఏళ్లు, పొలిట్‌ బ్యూరోలో 18 ఏళ్లు సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యమం ఎదురొంటున్న వైఫల్యాలకు, భారీ నష్టాలకు బాధ్యత వహిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...