Mansarovar Yatra | ప్రారంభం కానున్న మానస సరోవర్ యాత్ర.. 15న తొలి బృందం ప్రయాణం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mansarovar Yatra | హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇండియా (India), చైనా (China) మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా తీర్థయాత్ర చాలా సంవత్సరాలుగా నిలిచి పోయింది. అయితే, సిక్కింలోని నాథు లా మార్గం ద్వారా యాత్ర (Yatra) తిరిగి ప్రారంభమవనుంది. జూన్ 15న 50 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ గాంగ్టక్ చేరుకోనుంది. యాత్రికుల భద్రత, సౌకర్యం, శ్రేయస్సు దృష్ట్యా సిక్కిం ప్రభుత్వం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mansarovar Yatra | హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇండియా (India), చైనా (China) మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా తీర్థయాత్ర చాలా సంవత్సరాలుగా నిలిచి పోయింది. అయితే, సిక్కింలోని నాథు లా మార్గం ద్వారా యాత్ర (Yatra) తిరిగి ప్రారంభమవనుంది. జూన్ 15న 50 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ గాంగ్టక్ చేరుకోనుంది.

యాత్రికుల భద్రత, సౌకర్యం, శ్రేయస్సు దృష్ట్యా సిక్కిం ప్రభుత్వం (Sikkim government) విస్తృతమైన సన్నాహాలు చేసిందని ‘ది స్టేట్స్మన్’ వెల్లడించింది. ప్రతి యాత్రికుల బృందంతో పాటు ఇద్దరు అధికారులు ప్రయాణమంతా వెంట ఉంటారని సిక్కిం పర్యాటక (Sikkim Tourism), పౌర విమానయాన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సీఎస్ రావు చెప్పారు. యాత్రికులు ఎత్తయిన తీర్థయాత్రకు వెళ్లే ముందు గాంగ్టక్​లో ఐదు రోజుల తప్పనిసరి వాతావరణ ఇబ్బందులకు గురవుతారు. ఈ నేపథ్యంలో యాత్ర మార్గంలో కీలకమైన ప్రదేశాలలో వైద్య సౌకర్యాలు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు రావు తెలిపారు.

జూన్ 20న నాథు లా ద్వారా మొదటి బృందం చైనాలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ (Sikkim Chief Minister Prem Singh Tamang) కనుమ వద్ద జెండా ఊపి మొదటి బ్యాచ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. నాథు లా మార్గంతో (Nathu La route) పాటు మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఉంది. ఉత్తరాఖండ్​లోని లిపులేఖ్ పాస్ కంటే శారీరకంగా తక్కువ శ్రమతో కూడుకున్నది. అలాగే అత్యంత సుందరమైనది. నాథు లా మార్గం తాత్కాలికంగా నిలిపివేయబడడానికి ముందే ఇది యాత్రికుల ఆదరణ పొందింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...