Mallojula Venugopal | లొంగిపోయిన మల్లోజుల.. మహారాష్ట్ర సీఎంకు ఆయుధాలు అప్పగింత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallojula Venugopal | మావోయిస్ట్​ అగ్రనేత, పోలిట్​ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​రావు మంగళవారం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ (Maharashtra CM Devendra Fadnavis)బుధవారం అధికారికంగా ప్రకటించారు. గడ్చిరోలి ఎస్పీ ఆఫీసు (Gadchiroli SP Office)లో సీఎం ఫడ్నవీస్​ ప్రెస్​మీట్​ పెట్టారు. నిషేధిత CPI (మావోయిస్ట్) సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్​ సోనూ, అలియాస్​ భూపతి 61 మంది […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallojula Venugopal | మావోయిస్ట్​ అగ్రనేత, పోలిట్​ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​రావు మంగళవారం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ (Maharashtra CM Devendra Fadnavis)బుధవారం అధికారికంగా ప్రకటించారు.

గడ్చిరోలి ఎస్పీ ఆఫీసు (Gadchiroli SP Office)లో సీఎం ఫడ్నవీస్​ ప్రెస్​మీట్​ పెట్టారు. నిషేధిత CPI (మావోయిస్ట్) సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్​ సోనూ, అలియాస్​ భూపతి 61 మంది మావోయిస్టులతో కలిసి అక్టోబర్ 13–14 రాత్రి భమ్రాగఢ్‌లోని ఫోడేవాడ గ్రామంలో పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మిగతా మావోలు సీఎంకు బుధవారం ఆయుధాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్​ మాట్లాడుతూ.. మావోయిస్టులు (Maoists) లొంగిపోవాలని సూచించారు. గత నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాంతం ఒక్కరు కూడా ఉద్యమంలో చేరలేదని చెప్పారు. ఈ పురోగతికి C-60 కమాండోల కృషి, రాజ్యాంగ పాలనపై పెరుగుతున్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి, శాంతి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఆయన నొక్కిచెప్పారు.

Mallojula Venugopal | పెద్దపల్లి నుంచి..

మల్లోజుల వేణుగోపాల్​ పెద్దపల్లి జిల్లా (Peddapalli District)కు చెందిన వారు. 2011లో ఎన్​కౌంటర్​లో చనిపోయిన కిషన్​జీ అలియాస్​ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్​కౌంటర్​ మరణించారు. 1970లో ఉద్యమ బాట పట్టిన ఆయన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. వెస్ట్​ బెంగాల్​ లాల్​గడ్​ ఉద్యమానికి వేణుగోపాల్ నాయకత్వం వహించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్​ పొలిట్ బ్యూరో సభ్యురాలు పోతుల సుజాత వేణుగోపాల్ అన్న భార్య కావడం గమనార్హం.

Mallojula Venugopal | అనేక కేసులు

మల్లోజుల వేణుగోపాలరావు (Mallojula Venugopal Rao)పై వందకు పైగా కేసులు ఉన్నాయి. సోను, సోను దాదా, అభయ్, మాస్టర్, వివేక్, వేణు వంటి మారుపేర్లతో కూడా మల్లోజులను పిలుస్తారు. ఆయన మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. 76 మంది CRPF సిబ్బందిని బలిగొన్న 2010 దంతెవాడ ఆకస్మిక దాడిలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన లొంగిపోవడం గడ్చిరోలిలో మావోలకు పెద్ద ఎదురు దెబ్బ అని పోలీసులు పేర్కొంటున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...