Stock Market | మూడో రోజూ నష్టాలు కంటిన్యూ..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తూ వస్తుండడం, ఎఫ్‌ఐఐలు నిరంతరాయంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతుండడంతో మన మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తూ వస్తుండడం, ఎఫ్‌ఐఐలు నిరంతరాయంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతుండడంతో మన మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ (RBI MPC Meeting) బుధవారం ప్రారంభమైంది. ఇది మూడురోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభంతో ప్రారంభమై 119 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాలనుంచి 506 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా 62 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 171 పాయింట్లు పతనమైంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో 84,813 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 25,902 వద్ద ఉన్నాయి.

ఐటీ మినహా..

బీఎస్‌ఈలో ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల స్టాక్స్‌ ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ ఇండెక్స్‌ 0.92 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.00 శాతం నష్టపోయింది. పీఎస్‌యూ 1.54 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.20 శాతం, ఇన్‌ఫ్రా 1.12 శాతం, పవర్‌ 1.07 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.03 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.90 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.88 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.05 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.66 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్‌ 1.68 శాతం, ఇన్ఫోసిస్‌ 1.05 శాతం, టెక్‌ మహీంద్రా 0.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.38 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.19 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బీఈఎల్‌ 1.97 శాతం, ఎస్‌బీఐ 1.81 శాతం, ఎంఅండ్‌ఎం 1.69 శాతం, టాటా స్టీల్‌ 1.46 శాతం, ఎన్టీపీసీ 1.40 శాతం నష్టాలతో ఉన్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...