Mahabubnagar | ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్​ సజీవ దహనం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar | రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) కలవర పెడుతున్నాయి. ఇటీవల యాక్సిడెంట్లు పెరిగాయి. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా.. ఫలితం ఉండటం లేదు. మహబూబ్​నగర్​ (Mahabubnagar) జిల్లాలో ఓ లారీ ఇథనాల్​ లోడ్​తో వెళ్తున్న ట్యాంకర్​ను ఢీకొట్టింది. హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్​ను లారీ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఇథనాల్​ ట్యాంకర్​ (Ethanol Tanker) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar | రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) కలవర పెడుతున్నాయి. ఇటీవల యాక్సిడెంట్లు పెరిగాయి. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా.. ఫలితం ఉండటం లేదు.

మహబూబ్​నగర్​ (Mahabubnagar) జిల్లాలో ఓ లారీ ఇథనాల్​ లోడ్​తో వెళ్తున్న ట్యాంకర్​ను ఢీకొట్టింది. హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్​ను లారీ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఇథనాల్​ ట్యాంకర్​ (Ethanol Tanker) డ్రైవర్​ సజీవ దహనం అయ్యాడు. లారీ డ్రైవర్​ను స్థానికులు రక్షించారు. సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్​ జామ్​ అయింది.

Mahabubnagar | డీసీఎం ఢీకొని ఇద్దరి మృతి

హన్మకొండ జిల్లా (Hanmakonda District)లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్​ బైక్​ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను యాకూబ్, వెంకట్ రెడ్డి‌గా గుర్తించారు.

Mahabubnagar | చలికాలంలో జాగ్రత్త

చలికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పొగ మంచు కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించవు. అలాగే చలితీవ్రతతో అద్దాలపై తేమ పేరుకుపోయి వాహనాలు సరిగా కనపడవు. దీంతో అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనదారులు రాత్రి పూట జాగ్రత్తగా వెళ్లాలి. ఫ్రంట్​, బ్యాక్​ లైట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలి. రోడ్డుపై వాహనాలు ఆపితే పార్కింగ్​ లైట్లు వేయాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...