Leopard on KKY road | కేకేవై రహదారిపై చిరుత కలకలం

అక్షరటుడే, లింగంపేట: Leopard on KKY road | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎన్​హెచ్​–44పై ఇందల్వాయి సమీపంలో ఓ చిరుత (Leopard)  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సైతం సంచరించింది. కొన్ని నెలల క్రితం ఆర్మూర్​లోని సిద్ధుల గుట్టపై రోడ్డు పక్కన చిరుత కనిపించిన విషయం తెలిసిందే. ఇలా చిరుతలు పలుమార్లు తారసపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో చిరుత […]

అక్షరటుడే, లింగంపేట: Leopard on KKY road | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎన్​హెచ్​–44పై ఇందల్వాయి సమీపంలో ఓ చిరుత (Leopard)  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సైతం సంచరించింది. కొన్ని నెలల క్రితం ఆర్మూర్​లోని సిద్ధుల గుట్టపై రోడ్డు పక్కన చిరుత కనిపించిన విషయం తెలిసిందే. ఇలా చిరుతలు పలుమార్లు తారసపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇక్కడ కొన్ని రోజులుగా చిరుత తరచూగా కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Leopard on KKY road | ఎల్లారెడ్డి – లింగంపేట రోడ్డులో..

కేకే వైరహదారిపై ఎల్లారెడ్డి – లింగంపేట మధ్యలో ఉన్న అడవి ప్రాంతంలో చిరుత సంచరించింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహన చోదకులు జంకుతున్నారు. మంగళవారం తెల్లవారు 3:30 గంటలకు లింగంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాజిద్ ఖాన్ ఎల్లారెడ్డి నుంచి లింగంపేటకు వస్తుండగా మెంగారం అడవి ప్రాంతంలో చిరుత రోడ్డుపైకి రావడంతో కారును నిలిపి వేసుకున్నట్లు తెలిపారు. ఈ రోడ్డుపై వానచోదకులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.

Leopard on KKY road | భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు

గత నెల రోజులుగా చిరుత రోడ్డుపై కనబడుతుండడంతో వాహన చోదకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఇప్పటివరకు గుర్తులు గాని, బోర్డులు ఏర్పాటు చేయలేదు. కేకేవై రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కావున అటవీశాఖ సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని వాహనచోదకులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...