Pakistan | లష్కరే తోయిబా కవ్వింపులు.. ప్రధాని మోదీకి బెదిరింపులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor)తో చావు దెబ్బ తిన్నా.. పాకిస్థాన్​, ఆ దేశంలోని ఉగ్రవాదులకు ఇంకా బుద్ది రావడం లేదు. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్​ సైఫుల్లా కసూరి కవ్వింపులకు పాల్పడ్డాడు. పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) సూత్రదారి అయిన సైఫుల్లా పాక్​లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏకంగా ప్రధాని మోదీ (PM Modi)ని బెదిరించడం గమనార్హం. మరోసారి పహల్గామ్​లాంటి దాడి చేస్తామని అన్నాడు. కసూరి మాట్లాడుతూ.. భారత్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor)తో చావు దెబ్బ తిన్నా.. పాకిస్థాన్​, ఆ దేశంలోని ఉగ్రవాదులకు ఇంకా బుద్ది రావడం లేదు. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్​ సైఫుల్లా కసూరి కవ్వింపులకు పాల్పడ్డాడు.

పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) సూత్రదారి అయిన సైఫుల్లా పాక్​లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏకంగా ప్రధాని మోదీ (PM Modi)ని బెదిరించడం గమనార్హం. మరోసారి పహల్గామ్​లాంటి దాడి చేస్తామని అన్నాడు. కసూరి మాట్లాడుతూ.. భారత్​ నీటి ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించాడు. ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్​లో వరదలు రావడానికి కారణం అవుతోందన్నాడు. ‘‘మే 10న మనం చేసినట్లుగా మోదీకి పాఠం నేర్పించండి”అని ఆ దేశ ఆర్మీ చీఫ్​ను కోరాడు.

Pakistan | ప్రతీకారం తీర్చుకుంటాం

కసూరి వ్యాఖ్యలు పాక్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వరద సహాయక చర్యల పేరుతో ఆయన పర్యటిస్తూ.. భారత్​పై విష ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల వరదలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు. పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి, ఉగ్రవాద చొరబాటులను ప్రోత్సహించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

Pakistan | చావు దెబ్బ తిన్నా..

పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్​ 22న పహల్గామ్​లో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి భారత్​ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం పాక్​ దాడికి దిగితే ధీటుగా బదులిచ్చింది. పాక్​ యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఆ దేశంలోని ఎయిర్​ బేస్​లను సైతం భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. యుద్ధంలో చావు దెబ్బ తిన్నా పాకిస్థాన్​ బయటకు మాత్రం తామే గెలిచామని చెప్పుకుంటోంది. భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు ప్రచారం చేసుకుంటుంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలోచిస్తాన్​ వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​ భారత్​పై విష ప్రచారం మాత్రం మానడం లేదు. సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి ఉగ్రవాదులను భారత్​పైకి ఉసిగొల్పుతోంది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...