Karnataka | కర్ణాటకలో భాషా వివాదం.. తెలుగు బోర్డుల తొలగింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలో కొందరు మళ్లీ భాషా వివాదానికి తెరలేపారు. తెలుగు బోర్డులను తొలగిస్తున్నారు. దుకాణాలు, షాపింగ్​ మాళ్ల పేర్లు తెలుగులో ఉంటే తీసేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్​ అవుతోంది. కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి విజయనగర జిల్లా (Vijayanagara District) అధ్యక్షుడు జి. రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో తెలుగు అక్షరాలను సైన్ బోర్డులను తొలగించారు. ఓ షాపింగ్‌ మాల్‌ (Shopping Mall)కు తెలుగులో ఉన్న […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలో కొందరు మళ్లీ భాషా వివాదానికి తెరలేపారు. తెలుగు బోర్డులను తొలగిస్తున్నారు. దుకాణాలు, షాపింగ్​ మాళ్ల పేర్లు తెలుగులో ఉంటే తీసేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్​ అవుతోంది.

కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి విజయనగర జిల్లా (Vijayanagara District) అధ్యక్షుడు జి. రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో తెలుగు అక్షరాలను సైన్ బోర్డులను తొలగించారు. ఓ షాపింగ్‌ మాల్‌ (Shopping Mall)కు తెలుగులో ఉన్న పేరు తొలగించారు. ఆ వీడియోను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు. దీంతో తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కన్నడలో బోర్డులు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక్కడ ఏ భాషలో బోర్డులు ఉన్నా.. ఎవరు తొలగించరని కామెంట్లు చేస్తున్నారు.

కానీ తెలుగు బోర్డులను తొలగించడం సరికాదని మండిపడుతున్నారు. కొంతమంది కర్ణాటక ప్రజలు సైతం ఆ వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి మెలసి ఉంటున్న తెలుగు, కన్నడ ప్రజల మధ్య రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలుకుతున్నారు. పని పాట లేని వారు ఇలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తారని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...