అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | బీఆర్ఎస్కు కేటీఆర్ గుదిబండ అని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేటీఆర్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ (BRS) గెలవదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా (Nalgonda district) దేవరకొండలో సీసం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దేవరకొండ గడ్డ (Devarakonda Gadda) కాంగ్రెస్ అడ్డా అన్నారు. నిజాం నవాబులను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరిగిందని చెప్పారు.
CM Revanth Reddy | కేసీఆర్పై విమర్శలు
తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల దోపిడీ చాలలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని పీక్కు తిన్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు కేటీఆరే గుదిబండ అన్నారు. ఆయన ఉన్నంత కాలం ప్రజలు ఆ పార్టీని బండకేసి కొడతానే ఉంటారని చెప్పారు.
CM Revanth Reddy | సర్పంచులను కలుస్తున్నారు
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని కలిసే వారు కాదని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇచ్చే వారు కాదన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు సర్పంచులు, నలుగురు వార్డు సభ్యులను పిలిపించుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను బండకేసి కొట్టారన్నారు.
ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
