Kokapet Lands | మళ్లీ కోట్లు పలికిన కోకాపేట భూములు.. ఎకరం ఎంతంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kokapet Lands | హైదరాబాద్​ నగర శివారులోని కోకాపేట భూములు (Kokapet Lands) హాట్​ కేక్​ల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లు పెట్టి ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. తాజాగా ఎకరం రూ.131 కోట్లు పలికింది. కోకాపేటలోని నియోపాలిస్​ భూములకు (Neopolis landsమూడో విడత వేలం ప్రక్రియ బుధవారం ముగిసింది. ప్లాట్​ నంబర్​ 19, 20ల్లోని భూములకు అధికారులు ఆన్​లైన్​లో వేలం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kokapet Lands | హైదరాబాద్​ నగర శివారులోని కోకాపేట భూములు (Kokapet Lands) హాట్​ కేక్​ల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లు పెట్టి ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. తాజాగా ఎకరం రూ.131 కోట్లు పలికింది.

కోకాపేటలోని నియోపాలిస్​ భూములకు (Neopolis landsమూడో విడత వేలం ప్రక్రియ బుధవారం ముగిసింది. ప్లాట్​ నంబర్​ 19, 20ల్లోని భూములకు అధికారులు ఆన్​లైన్​లో వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్ల చొప్పున యులా కన్స్ట్రక్షన్స్ & గ్లోబస్ ఇన్‌ఫ్రాకాన్‌ దక్కించుకుంది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరా రూ.118 కోట్ల చొప్పున బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్‌ వేలం పాడింది. మొత్తం 8.04 ఎకరాలకు వేలం నిర్వహించగా.. ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరింది.

Kokapet Lands | మూడు దశల్లో..

కోకాపేటలోని నియోపాలిస్​ లే అవుట్​లో (Neopolis Layout) భూములకు అధికారులు మూడు విడతల్లో వేలం నిర్వహించారు. నవంబర్​ 24న ప్లాట్‌ నంబర్‌ 17, 18లోని భూములకు ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్‌ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది. నవంబర్​ 28న రెండో దశ వేలం నిర్వహించారు. ప్లాట్​ నంబర్​ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు జీహెచ్​ఆర్​ సంస్థ దక్కించుకుంది. 16వ ప్లాట్​లోని భూమిని ఎకరాకు రూ.147.75 కోట్లకు చొప్పున గోద్రెజ్​ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం మూడు విడతల్లో కలిసి 27 ఎకరాలకు విక్రయించగా.. ప్రభుత్వానికి రూ.3,708 ఆదాయం వచ్చింది.

Kokapet Lands | 5న మళ్లీ వేలం..

ఈ నెల 5న మరోసారి హెచ్​ఎండీఏ అధికారులు (HMDA officials) వేలం పాట నిర్వహించనున్నారు. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు ఈ-వేలం జరగనుంది. దీంతో అందరి దృష్టి ఆ భూములపై ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...