Home » PCC Chief | కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: పీసీసీ చీఫ్​

PCC Chief | కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: పీసీసీ చీఫ్​

by tinnu
0 comments
PCC Chief

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ (PCC Chief Bomm Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసేందేమీ లేదన్నారు. ఏమీ చేయలేని కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహిస్తామనడం హాస్యాస్పదమన్నారు.

PCC Chief | కాంగ్రెస్​ను ప్రజలు శభాష్​ అంటున్నారు..

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు శభాష్​ అంటున్నారని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. ఇందుకు జూబ్లీహిల్స్​ ఎన్నికలే (Jubilee Hills elections) నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్​లో కనీసం డిపాజిట్​ కూడా దక్కించుకోలేని బీజేపీ ప్రతినిధులు మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

PCC Chief | గర్వంగా గ్లోబల్​ సమ్మిట్​..

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో గర్వంగా గ్లోబల్​ సమ్మిట్​ జరుపుకుంటున్నామని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. కేసీఆర్​ (KCR) చేసిన నిర్వాకం కారణంగా రాష్ట్రం రూ.8లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.

You may also like