Pakistan market | కిలో చికెన్​ రూ.800.. భారత్​ దెబ్బకు పాకిస్తాన్​ మార్కెట్​ కుదేలు
Pakistan market | కిలో చికెన్​ రూ.800.. భారత్​ దెబ్బకు పాకిస్తాన్​ మార్కెట్​ కుదేలు

అక్షరటుడే, వెబ్ డెస్క్: Pakistan market : పాకిస్తాన్​ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అతలాకుతలంగా మారింది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం తల్లడిల్లుతోంది. పహల్ గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్​ పరిస్థితి మరింత దిగజారింది. భారత్​తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో పాక్​ ద్రవ్యోల్బణం మరింత కొండెక్కింది.

Pakistan market : దీర్ఘకాలంలో భారీ నష్టం తప్పదు..

భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3838.53 కోట్లుగా నమోదైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారీ-వాఘా సరిహద్దు ప్రధాన భూమిక పోషించేది. ఇప్పుడు ఈ మార్గం మూసివేయడంతో పాకిస్తాన్ కు తక్షణ నష్టంతోపాటు దీర్ఘకాలంలో ఆర్థికంగా మరింత దిగజారే దుస్థితి ఏర్పడింది.

Pakistan market : ఆకాశాన్ని అంటుతున్న ధరలు..

పాకిస్తాన్​లో ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ కేజీ రూ. 800కు చేరుకుంది. కిలో టమాట రూ.150కి చేరింది. అరటి పండ్లు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కిలో ఆలుగడ్డలు రూ.100 దాటింది.