FASTag | వాహ‌న‌దారుల‌కి శుభ‌వార్త‌.. ఇక టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరమే లేదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FASTag | దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల విధానంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టోల్‌గేట్ల (Toll Gates) వద్ద వాహనాలు నిలిచిపోవడం, క్యూలైన్లలో సుదీర్ఘ కాలం వేచి చూడటం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలో కొత్త ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FASTag | దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల విధానంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

టోల్‌గేట్ల (Toll Gates) వద్ద వాహనాలు నిలిచిపోవడం, క్యూలైన్లలో సుదీర్ఘ కాలం వేచి చూడటం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలో కొత్త ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ స్కానింగ్ వరకు వాహనాలు ఆగాల్సిన పరిస్థితి ఉంది.

FASTag | కొత్త టెక్నాలజీ ప్రత్యేకతలు ఏమిటి?

సెలవుదినాలు, రద్దీ సమయాల్లో టోల్‌గేట్ల వద్ద భారీగా క్యూ లైన్లు ఏర్పడటం సాధారణంగా మారింది. అయితే రాబోయే కొత్త టెక్నాలజీ ప్రవేశంతో ఈ సమస్యలన్నీ చరిత్ర కావనున్నాయని గడ్కరీ స్పష్టం చేశారు. టోల్‌గేట్ వద్ద వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ (Electronic Toll Payment System) పూర్తిగా ఎఐ ఆధారిత ఆధునిక టెక్నాలజీపై రూపొందించారు.వాహనం దూసుకెళ్లే సమయంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ద్వారా ఫాస్టాగ్ నుంచి చెల్లింపు పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా అమలు చేసే ముందు మొదటగా 10 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ వ్యవస్థను పరీక్షించనున్నారు. విజయవంతంగా నడిస్తే మొత్తం దేశంలో ఈ విధానాన్ని అమలు చేస్తారని గడ్కరీ తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) ఓఆర్ఆర్‌లో కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి టెక్నాలజీ ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్లు సమాచారం. దీని వ‌ల‌న వాహనదారులకు లాభం, టోల్‌గేట్ల వద్ద నిలిచి ఉండే అవసరం లేకపోవడంతో సమయం ఆదా, ట్రాఫిక్ జాం సమస్య తగ్గింపు, ఇంధన పొదుపు, మరింత వేగవంతమైన ప్రయాణం చేయ‌వ‌చ్చు. కేంద్రం తీసుకురాబోతున్న ఈ నూతన ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ రోడ్డు ప్రయాణాల్లో పెద్ద మార్పుకు దారితీయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...