Modi-Putin | భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi-Putin | భారత్​–రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత్​లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, పుతిన్​ హైదరాబాద్ హౌజ్​ (Hyderabad House)లో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. భారత్​–రష్యా (India–Russia) మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు చేపట్టినట్లు నేతలు తెలిపారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi-Putin | భారత్​–రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత్​లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, పుతిన్​ హైదరాబాద్ హౌజ్​ (Hyderabad House)లో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

భారత్​–రష్యా (India–Russia) మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు చేపట్టినట్లు నేతలు తెలిపారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, రష్యా మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందన్నారు. రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్రదేశం.. భారత్ వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందన్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ఆకాంక్షించారు. 2030 వరకు ఆర్థిక సహకార అంశాలపై అంగీకారం కుదిరిందన్నారు.

Modi-Putin | భారత్​కు సహకరిస్తాం

అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు పుతిన్​ తెలిపారు. భారత్- రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్​ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భారత ఇంధన రంగ అభివృద్ధికి కావాల్సిన చమురు, గ్యాస్, బొగ్గు అంశాల్లో సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ, ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Modi-Putin | కలిసి పనిచేస్తాం

మోదీ (PM Modi) నివాసంలో ఆతిథ్యం సంతోషం కలిగించిందని పుతిన్​ తెలిపారు. 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల వ్యాపారం తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 64 బిలియన్‌ డాలర్ల ట్రేడ్‌ ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ అభివృద్ధిలో పరస్పరం సహకారం అందించుకుంటామని చెప్పారు. కుడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం విషయంలో భారత్‌కు సహకారం అందిస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పనిచేస్తామని పుతిన్​ పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా (Make in India)కు తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...