Bandi Sanjay | కేసీఆర్​ కుటుంబమే ఫోన్​ ట్యాపింగ్​ చేయించింది : బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | ఫోన్ ట్యాపింగ్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు (Prabhakar Rao)పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్​ కుటుంబమే పోన్​ ట్యాపింగ్​ (Phone Tapping)కు పాల్పడిందని బండి సంజయ్​ ఆరోపించారు. స్వయంగా కేసీఆర్​ కూతురు కవిత తనతో పాటు భర్త ఫోన్​ ట్యాప్​ అయిందని చెప్పినట్లు గుర్తు చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | ఫోన్ ట్యాపింగ్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు (Prabhakar Rao)పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్​ కుటుంబమే పోన్​ ట్యాపింగ్​ (Phone Tapping)కు పాల్పడిందని బండి సంజయ్​ ఆరోపించారు. స్వయంగా కేసీఆర్​ కూతురు కవిత తనతో పాటు భర్త ఫోన్​ ట్యాప్​ అయిందని చెప్పినట్లు గుర్తు చేశారు. ట్యాపింగ్​కు భయపడి హరీశ్​రావు (Harish Rao) ఏడాది పాటు ఫోన్​ వాడలేదన్నారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి లాభపడ్డారని చెప్పారు. వ్యాపారుల ఫోన్లను సైతం వదలలేదన్నారు. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎలక్ట్రోర్ బాండ్ల పేరుతో కోట్లు వసూలు చేసిందని చెప్పారు. కేసీఆర్​ హయాంలో బిచ్చగాళ్లు సైతం వాట్సాప్​ కాల్​ మాట్లాడుకునే పరిస్థితి ఉండేదన్నారు.

Bandi Sanjay | సిట్ ఏం సాధించింది

ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ ఏం సాధించిందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. హరీశ్​రావును అధికారులు ఎందుకు విచారించారన్నారు. ఆయన ఫోన్​ ట్యాప్​ అయినందుకా.. ఇతరుల ఫోన్​ ట్యాప్​ చేసినందుకా అనే విషయాలు తెలుపాలని డిమాండ్​ చేశారు. గతంలో తనను సిట్​ విచారించి స్టేట్​మెంట్ రికార్డు చేసిందని తెలిపారు. తన ఫోన్​ ట్యాప్​ అయినట్లు అధికారులు చెప్పారని, కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, పారాశ్రామిక వేత్తలను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారన్నారు.

Bandi Sanjay | కొండను తవ్వి..

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రభాకర్​రావును కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని బండి సంజయ్​ అన్నారు. విచారణ పేరిట హడావుడి చేస్తున్న సిట్​ ఎంత మందిని అరెస్ట్​ చేసిందన్నారు. ఈ కేసులో ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్​ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ (KCR)​, కేటీఆర్ (KTR)​ను అరెస్ట్ చేసే దమ్ము ​ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొండను తవ్వి ఎలుకను పట్టుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు. సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులు, అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...