Minister Seethakka | వేములవాడను పట్టించుకోని కేసీఆర్​ : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Seethakka | కేసీఆర్​ (KCR) హయాంలో వేములవాడ రాజన్న, మేడారం ఆలయాలను పట్టించుకోలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె వేములవాడ (Vemulawada)లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజన్నకు కోడె ముక్కులు చెల్లించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 19న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) చేతుల మీదుగా సమ్మక్క-సారలమ్మ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Seethakka | కేసీఆర్​ (KCR) హయాంలో వేములవాడ రాజన్న, మేడారం ఆలయాలను పట్టించుకోలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె వేములవాడ (Vemulawada)లో ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజన్నకు కోడె ముక్కులు చెల్లించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 19న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) చేతుల మీదుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని రాజన్నను కోరినట్లు మంత్రి చెప్పారు.

Minister Seethakka | వైభవంగా జాతర

సమ్మక్క సారలమ్మ గుడి (Sammakka Saralamma Temple)ని సీఎం రేవంత్​రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడలో సైతం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు ఆలయాలను పట్టించుకోలేదని విమర్శించారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజన్న గుడి అభివృద్ధి కావడానికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ కృషి కారణమన్నారు. ఆమె వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎండోమెంట్ అధికారులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...