TVK Chief Vijay | కరూర్‌ తొక్కిసలాట ఘటన.. ముగిసిన విజయ్‌ సీబీఐ విచారణ

అక్షరటుడే, వెబ్​డెస్క్: TVK Chief Vijay | కరూర్​ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్​ (actor Vijay) విచారణ ముగిసింది. సోమవారం సుమారు 6 గంటలపాటు సీబీఐ అధికారులు (CBI officials) ఆయనను ప్రశ్నించారు. విజయ్​ గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకొని 41 మంది చనిపోయారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల విజయ్​ను అధికారులు విచారించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: TVK Chief Vijay | కరూర్​ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్​ (actor Vijay) విచారణ ముగిసింది. సోమవారం సుమారు 6 గంటలపాటు సీబీఐ అధికారులు (CBI officials) ఆయనను ప్రశ్నించారు.

విజయ్​ గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకొని 41 మంది చనిపోయారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల విజయ్​ను అధికారులు విచారించారు. ఆ సమయంలో సాక్షిగా పలు విచారించిన అధికారులు, తాజాగా అనుమానితుడిగా ప్రశ్నించారు. జనవరి 12న ఆయన్ను ఆరు గంటల పాటు విచారించారు. జనవరి 13న మళ్లీ హాజరు కావాలని కోరినప్పటికీ, పొంగల్ కారణంగా ఆయన మరో తేదీని కోరారని అధికారులు తెలిపారు. దీంతో సోమవారం విచారించారు.

TVK Chief Vijay | సహకరిస్తాం

ర్యాలీకి సంబంధించిన నిర్ణయాలు, విజయ్​ ఆలస్యంగా రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే తొక్కిసలాట (stampede) చోటు చేసుకున్నా.. విజయ్​ తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. దీనిపై సైతం అధికారులు ప్రశ్నించారు. టీవీకే పార్టీ నాయకుడు నిర్మల్ కుమార్ సీబీఐ ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ దర్యాప్తునకు సహకరిస్తోందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరారు. మరోసారి విచారణకు విజయ్​ను పిలువలేదన్నారు. కాగా ఈ ఘటనపై ఫిబ్రవరి రెండోవారంలో విజయ్‌ పేరుతో సీబీఐ ఛార్జిషీట్‌ వేయనున్నట్లు సమాచారం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...